News January 26, 2025

KMR: 4 పథకాలు ప్రారంభోత్సవ గ్రామాలు ఇవే..!

image

KMR జిల్లాలో ఆదివారం నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చిన్న నాగరం, ర్యాగట్లపల్లి, శివార్ రాంరెడ్డి పల్లి, గుండెకల్లూర్, రైతు నగర్, సీతారాం పల్లి, బ్రాహ్మణపల్లి, బంగారపల్లి, గూడెం, ఎల్లారం, రాజ్ కాన్ పేట్, రాచూర్, అచైపల్లి, రాముల గుట్ట తండా, సుల్తాన్ నగర్, చిన్న తక్కడ్ పల్లి, హస్నాపూర్, నడిమి తండా, కన్నాపూర్ తండా, వజ్జేపల్లి ఖుర్దు, సంతాయి పెట్, మల్లాయిపల్లి గ్రామాలను ఎంపిక చేశారు.

Similar News

News November 4, 2025

ఏటూరునాగారం: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా

image

ఏటూరునాగారం ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 10న ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.

News November 4, 2025

అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలకు రెక్కలు

image

అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. పాడేరులో గత వారం చిక్కుడు కాయలు కిలో రూ.100ఉండగా నేడు 160కి వీరిగిపోయింది. అల్లం కిలో రూ.60 ఉండగా నేడు రూ.120కి పెరిగిందని వినియోగదారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్న కూరగాయలు తోటలు వర్షాలకు దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

News November 4, 2025

నర్సంపేట: పెన్సిల్ మొనపై కార్తీక దీపం..!

image

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని, పెన్సిల్ (లెడ్) మొనపై దీపపు ప్రమిదను చెక్కి, అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు. జయకుమార్ కనబరిచిన ఈ సూక్ష్మ ప్రతిభ పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.