News January 26, 2025

అక్రమ రవాణాను అడ్డుకున్న గజపతినగరం పోలీసులు

image

గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో హైవేపై శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 పశువులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు తెలిపారు. రెండు లారీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చిత్ర హింసలకు గురిచేస్తూ పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News December 30, 2025

రైలు నుంచి జారిపడి గుర్ల యువకుడి మృతి

image

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం స్వగ్రామానికి వస్తున్న యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. విజయనగరం (D) గుర్ల (M) గొలగం గ్రామానికి చెందిన కంది సాయిరాం (26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలోనే రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులు సాయిరాం కుటుంబ సభ్యులకు మంగళవారం తెలిపారు.

News December 30, 2025

డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

ఎరువుల విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం, రాబోయే పంటలకు అవసరమైన ఎరువులను గ్రామ, మండలాల వారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వచ్చే 15 రోజులకు అవసరమైన ఎరువుల అంచనాలను తెలియజేయాలన్నారు.

News December 29, 2025

VZM: రెవెన్యూ క్లినిక్‌లకు 23 దరఖాస్తులు

image

జిల్లాలో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ లకు 23 దరఖాస్తులు అందాయి. అందులో విజయనగరం డివిజన్‌కు 15, బొబ్బిలి డివిజన్‌కు 5, చీపురుపల్లి డివిజన్‌కు 3 దరఖాస్తులు అందాయి. వివిధ భూ సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారని ఆయా డివిజనల్ అధికారులు పేర్కొన్నారు. విజయనగరంలో ఆర్డీఓ కీర్తి ధరఖాస్తులు స్వీకరించారు.