News January 26, 2025

కామారెడ్డి: 615 ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాం: కలెక్టర్

image

4 పథకాల ప్రారంభోత్సవంపై సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 535 గ్రామ, 80 వార్డు ప్రజాపాలన సభలు నిర్వహించినట్లు తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు..

Similar News

News November 11, 2025

రూ.6.65 లక్షల కోట్లకు ఇళ్ల అమ్మకాలు: అనరాక్

image

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినా వాల్యూ పరంగా మాత్రం సగటు అమ్మకం విలువ 7% పెరిగిందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ప్రస్తుత FYలో తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 1.93 లక్షల ఇళ్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఇదే జోరులో మార్చి ముగిసే సమయానికి అమ్మకాల విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. HYDలో ఇళ్ల మార్కెట్ జోరుగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు.

News November 11, 2025

KMR: పంజా విసురుతున్న చలి

image

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం అత్యంత తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 12°C వరకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నుంచి ఉదయం వేళ, రాత్రి పూట చలి తీవ్రత అధికంగా ఉంటుందని చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 11, 2025

యాదాద్రి: కోతుల సమస్యపై కార్టూన్‌తో ప్రభుత్వం, కోర్ట్‌కు విజ్ఞప్తి!

image

బడి, బస్సు, రైల్వేస్టేషన్, ఆటస్థలం, జనావాసాల్లో కుక్కలను కట్టడి చేయాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ ఆదేశించిన విషయం తెలిదిందే. అయితే కోతుల సమస్యను ఎత్తి చూపుతూ రామన్నపేటకు చెంది కవి, టీచర్, కార్టూనిస్ట్ పాల్వంచ హరికిషన్ వేసిన కార్టూన్ ఆలోచింపజేస్తుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కోతులు తీవ్రంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని వ్యంగ్య చిత్రంతో కోరారు. సహృదయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు.