News January 26, 2025
సిరిసిల్ల: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
NLG: సంత.. సౌకర్యాలు లేక చింత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో నిర్వహించే సంత స్థలాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్, గురజాల, అమ్మనబోలు, NKP, చింతపల్లి, కొండమల్లేపల్లి, గొడకళ్ల, త్రిపురారం, కొండమడుగు, నెమ్మికల్, తుంగతుర్తి, అర్వపల్లి, ఆత్మకూర్ (ఎం), వలిగొండ, రామన్నపేటలో సంతలు జరుగుతాయి. సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
News September 16, 2025
NLG: అమ్మకానికి ‘దొడ్డు’ బియ్యం

నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ వేలం ద్వారా అమ్మకం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోకు రూ.24 చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News September 16, 2025
వరంగల్: పొట్ట దశలో వరి.. యూరియా మరి?

ఉమ్మడి ఓరుగల్లు రైతన్నకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ముందస్తుగా వరి నాట్లు వేసుకున్న పొలాలు దాదాపు పొట్ట దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు యూరియా వేసినా ఫలితం ఉండదని రైతులు అంటున్నారు. పొద్దున్నే PACS సెంటర్ దగ్గరకు సద్ది బువ్వ పట్టుకొని వెళ్లినా ఒక్క బస్తా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక యాసంగి నష్టపోతే, వానాకాలం పంటకు<<17717414>> ‘యూరియా’ <<>>తిప్పలు పెడుతోందని వాపోతున్నారు. మీ పంట ఏ దశలో ఉంది?