News January 26, 2025
హత్యకు గురైన వ్యక్తి పాడెను మోసిన గోరంట్ల మాధవ్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో నిన్న హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్నకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో భాగంగా అతని పాడెహిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మోశారు. కురవ ఈరన్న హత్యను ఖండించి.. మాధవ్ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 16, 2025
సిరిసిల్ల: టీకా కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ రజిత

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. రజిత శనివారం ఆకస్మికంగా అంబేద్కర్ నగర్, శాంతినగర్లలోని టీకా కేంద్రాలను తనిఖీ చేశారు. కోల్డ్ చెయిన్ నిల్వలు, రికార్డులు, ఐస్ ప్యాక్స్ను పరిశీలించి, సక్రమ నిర్వహణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ సకాలంలో టీకాలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ సంపత్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.
News November 16, 2025
ఎల్లారెడ్డిపేట: ‘పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి’

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.
News November 16, 2025
SRCL: ‘బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు సాగాలి’

సిరిసిల్ల: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగర్వాల్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని ఆమె అన్నారు.


