News January 26, 2025

సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

ఏలూరు: 15 నిమిషాల్లో బాలిక గుర్తింపు

image

ఏలూరు రూరల్ పోలీసులు తప్పిపోయిన బాలికను 15 నిమిషాల్లో కనుగొన్నారు. సోమవారం మాదేపల్లి గ్రామం నుంచి డయల్ 112కు బాలికలు కనబడుటలేదని అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన రూరల్ పోలీసులు తప్పిపోయిన 12 ఏళ్ల బాలికను సురక్షితంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఎస్సై నాగబాబు, సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ అభినందించారు.

News November 3, 2025

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

image

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

News November 3, 2025

బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

image

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.