News March 18, 2024
బాధితుల అకౌంట్లోకి సైబర్ క్రైమ్ డబ్బులు

TG: సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన PSకు వెళ్లి అధికారి ద్వారా డబ్బు ఇప్పించాలని కోర్టులో పిల్ వేయాలి. అధికారి ఖాతాలు చెక్ చేసి.. బ్యాంకులు ఫ్రీజ్ చేశాయని గుర్తిస్తే, డబ్బును బాధితులకు ఇప్పిస్తున్నారు.
Similar News
News October 27, 2025
వయసును తగ్గించే ఆహారాలివే..

ప్రస్తుతం మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లతో కొంతమందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల చికిత్సలు చేయించుకోవడం, ఏవేవో క్రీములు రాసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఆహారంలో బ్లూబెర్రీలు, టమాటాలు, పెరుగు, గ్రీన్ టీ, డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు హైడ్రేటెడ్గా ఉండటం, మెడిటేషన్ చేయడం మంచిదంటున్నారు.
News October 27, 2025
రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News October 27, 2025
ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపులో మార్పులు ఎందుకంటే?

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం తెలిసిందే. ఇక నుంచి శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక ₹2 లక్షలు కాకుండా ₹1.40 లక్షలే ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తుండటం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి విడత ₹లక్షతో కలిపి మిగతా ₹60 వేలను అందించనుంది.


