News January 26, 2025
శంబర జాతరకు 130 ప్రత్యేక బస్సులు

ఈనెల 27,28,29 తేదీల్లో జరిగే పార్వతీపురం జిల్లాలో జరిగే శంబర జాతరకు 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు విజయనగరం ప్రజారావాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, సాలూరు డిపోలకు సంబంధించిన బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులు గజపతినగరం, రామభద్రపురం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం రూట్లలో సర్వీస్ అందిస్తాయని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
VZM: కంచం చేత పట్టి లైన్లో నిల్చున్న కలెక్టర్

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
News November 7, 2025
VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News November 7, 2025
వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పని: VZM కలెక్టర్

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


