News January 26, 2025
పద్మ అవార్డు గ్రహీతలకు YS జగన్ విషెస్

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం), మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం)’ అని వారి పేర్లను ట్వీట్ చేశారు.
Similar News
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్-1, రహమత్ నగర్, 5న షేక్పేట్-2, యూసుఫ్గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679
News October 31, 2025
బాహుబలి యూనివర్స్లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.


