News January 26, 2025
విశాఖ: 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు

గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ భారక్స్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు దక్కాయి. వారిలో VMRDA కమీషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ,ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్, డిప్యూటీ కలెక్టర్లు కె.సంగీత్ మాథుర్, సుధాసాగర్ ఉన్నారు.
Similar News
News January 13, 2026
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 10 మందికి మెమోలు

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెమోలు జారీ చేశారు. సోమవారం PGRSలో అర్జీలపై సమీక్షించారు. టౌన్ప్లానింగ్, హౌసింగ్ విభాగాల్లో తూతూమంత్రంగా ఎండార్స్మెంట్లు ఇస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 4, 5, 6, 8వ జోన్లలో సంబంధిత కమిషనర్లకు, టౌన్ప్లానింగ్, DE, ASOలకు మెమోలు జారీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోడల్ అధికారి శేషశైలజను ఆదేశించారు.
News January 13, 2026
విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.
News January 13, 2026
విశాఖ: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.


