News January 26, 2025
విడిపోయిన వారి పిల్లలకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం: అధ్యయనం

తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు పెద్దయ్యాక గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని కెనడా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘65 ఏళ్లు దాటిన 13వేలమందిపై మా సర్వే నిర్వహించాం. 18 ఏళ్లు వచ్చేలోపు తల్లిదండ్రులు విడిపోవడాన్ని చూసినవారిలో 60శాతంమందికి గుండెపోటు వచ్చింది. వారు డిప్రెషన్, డయాబెటిస్ వంటివాటితో బాధపడుతున్నట్లు గుర్తించాం. ఇవన్నీ కలగలిపే గుండెపోటుకు దారి తీస్తున్నాయి’ అని తమ నివేదికలో వివరించారు.
Similar News
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.