News January 26, 2025

ఖమ్మంలో రోజూ 69వేల మంది మహిళల ప్రయాణం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి రోజు సుమారు 69 వేలకు పైగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రూ.21,31,00,000 సబ్సిడీని ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు 7,53,723 సిలిండర్లను రూ.500కే సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి నెలా దాదాపు రూ.10 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించి 2,57,995 గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు.

Similar News

News January 12, 2026

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

image

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News January 12, 2026

వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.

News January 12, 2026

ఖమ్మం: మున్సిపాలిటీల గెలుపుపై మంత్రుల ఫోకస్

image

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఏదులాపురంలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంలో ఒక్కో వార్డుకు ఐదుగురి చొప్పున జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది.