News January 26, 2025
PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.
Similar News
News November 7, 2025
బిహార్లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

బిహార్లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.
News November 7, 2025
వరంగల్: సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష..!

సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష అని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంట్లోని చిన్నారులు, విద్యార్థులకు పెద్దలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ మీ కుటుంబాన్ని సైబర్ నేరాల భారీ నుంచి కాపాడుకోవాలని, అవగాహనతోనే నేరాల కట్టడి సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. SHARE IT
News November 7, 2025
అక్టోబర్లో రూ.119.35 కోట్లు ఆదాయం

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. స్వామివారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1.23 కోట్ల లడ్డూలు విక్రయం జరిగింది. 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు 8.31 లక్షల మంది స్వామి వారికి సమర్పించారు.


