News March 18, 2024

హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

image

AP: గ్రూప్-1(2018) మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా మెయిన్స్ పేపర్లను రెండు సార్లు మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసింది.

Similar News

News September 30, 2024

GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.

News September 30, 2024

గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!

image

ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్‌లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.

News September 30, 2024

‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

image

TG: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది.