News January 26, 2025
ఢిల్లీలో ఏటికొప్పాక బొమ్మల శకటం.. స్పందించిన సీఎం

AP: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News January 24, 2026
2014 నుంచి విచారణ చేయిద్దాం: భట్టి

TG: సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని, 2014 నుంచి జరిగిన టెండర్లపై విచారణ చేయిద్దామని Dy.CM భట్టి అన్నారు. ‘హరీశ్ రావుకు విచారణ కావాలంటే మాకే లేఖ రాయండి. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేయిద్దాం. CM రేవంత్ రాగానే విచారణ కోరతాం’ అని తెలిపారు. తన 40ఏళ్ల ప్రతిష్ఠను కట్టుకథలతో <<18943021>>దెబ్బతీయొద్దన్నారు<<>>. ఆస్తులు కూడబెట్టడానికి కాదు సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News January 24, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

గువాహటిలోని <


