News January 26, 2025

అకౌంట్లోకి డబ్బులు.. ఇలా చేయడం తప్పనిసరి

image

పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను ఫిబ్రవరిలో కేంద్రం జమ చేసే అవకాశం ఉంది. జనవరి 31లోగా E-KYC చేయించుకున్న రైతులకే ఈ పథకం కింద రూ.2వేలు జమ అవుతాయి. pmkisan.gov.in సైట్‌లో సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే చాలు. e-KYC కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి. ☛☛SHARE IT

Similar News

News September 13, 2025

సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: KTR

image

TG: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని KTR ట్వీట్ చేశారు. ‘ఈ ఉద్యమానికి నేటితో 14 ఏళ్లు నిండాయి. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. 2011, SEP 12న కరీంనగర్ జనగర్జనలో KCR పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అంటూ నినదించింది. నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసింది’ అని పేర్కొన్నారు.

News September 13, 2025

3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

image

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://rrcrecruit.co.in/<<>>

News September 13, 2025

ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

image

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.