News March 18, 2024
గిల్కు మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్

హార్దిక్ పాండ్య ముంబైకు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ శుభ్మన్ గిల్ చేతికి వచ్చింది. అయితే, ఐపీఎల్ స్థాయిలో కెప్టెన్సీని యువ ఆటగాడైన గిల్ ఎలా నెట్టుకొస్తారన్న అనుమానాలను జీటీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ తోసిపుచ్చారు. ‘నాయకత్వ బాధ్యతల్ని గిల్ సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం మాకుంది. అవసరమైన సాయాన్ని అందించి అండగా నిలుస్తాం. సవాళ్లను ఎదుర్కొని నిలబడగలిగే సత్తా తనకు ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
రైలులో ప్రయాణించే ముందు ఇది తెలుసుకోండి!

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే లగేజీ పరిమితులను నిర్దేశించింది. ప్రయాణ తరగతిని బట్టి లగేజీ బరువుపై రుసుము వసూలు చేస్తారు. ఒక్కరి దగ్గర AC ఫస్ట్ క్లాస్లో 70KGS, AC 2టైర్లో 50KGS, AC 3టైర్& స్లీపర్లో 40KGS, జనరల్ బోగీలో 35 కేజీల బరువు కంటే మించకూడదు. ఈ పరిమితిని మించి తీసుకెళ్లాలనుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT
News April 2, 2025
ముంబైని వదిలి గోవాకు?

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 2, 2025
బీసీల డిమాండ్ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.