News January 27, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,06,182 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,11,055ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.61,090, అన్నదానం రూ.34,037,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News September 18, 2025
HYD: నీటి నాణ్యత పరీక్షలపై జలమండలి ఫోకస్

జీహెచ్ఎంసీ నుంచి ORR వ్యాప్తంగా నల్లా నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని పరిశీలిస్తోంది. అనేకచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకుపైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News September 18, 2025
వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే నిర్ణయం: అచ్చెన్నాయుడు

AP: యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. YCP నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.
News September 18, 2025
నిర్మల్: నీరు నిలిస్తే.. నేల నవ్వుతుంది..!

భూమిపై ఉన్న జీవరాసుల మనుగడకు నీరు ఎంతో అవసరం. నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమి నిర్జీవ గ్రహంగా మారుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వర్షాకాలంలో దిలావర్పూర్ మండలంలోని చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. వర్షపు నీటిని వృథా చేయకుండా సాగునీటి అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.