News January 27, 2025

గుడివాడ: గవర్నర్ నజీర్‌ను కలిసిన ఎమ్మెల్యే రాము

image

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ నజీర్ ఎమ్మెల్యే రాముతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .

Similar News

News January 27, 2026

పొగమంచు వల్ల అపరాల సాగు రైతుకు నష్టమే..!

image

కృష్ణాజిల్లాలో పొగమంచు ప్రభావంతో అపరాల సాగు రైతులు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో సూర్యరశ్మి పంటపై పడకపోవడం వల్ల ఆకులపై తేమ పెరిగి ఫంగస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా అపరాల మొక్కల ఎదుగుదల లోపించి, పూత–గింజ దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతుకు నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు

News January 27, 2026

అపూర్వ సహోదరులు.. పోలీస్ విభాగానికి గర్వకారణం

image

కృష్ణ జిల్లా పోలీస్ విభాగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. H.జంక్షన్ SI వి.సురేష్, పామర్రు CI. వి.సుభాకర్ స్వయాన అన్నదమ్ములు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఇద్దరూ ఒకే వేదికపై ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు హోదాల్లో ఒకే సందర్భంలో పురస్కారాలు అందుకోవడం పోలీస్ విభాగానికి గర్వకారణం.

News January 27, 2026

వచ్చే నెల 7న ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడి బండి ఉత్సవం!

image

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో 11వ రోజును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజున సిడి బండి ఉత్సవంగా ఫిబ్రవరి 7న జరగనుంది. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడిని సిడి బండిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అదే టైంలో ఆ యువకుడిని అరటిపండులతో కొట్టడం సంప్రదాయం. ఆ ఒక్క రోజే లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా. మరి మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.