News January 27, 2025
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

బాపట్ల జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. రాజ్యాంగ ముసాయిదా రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరిచారని, తద్వారా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు.
Similar News
News March 25, 2026
సంగారెడ్డి: టీబీ రహిత గ్రామంగా కడ్పల్ ఎంపిక

సిర్గాపూర్ మండలం కడ్పల్ టీబీ రహిత గ్రామంగా ఎన్నికైనట్లు జిల్లా టీబీ సూపర్వైజర్ అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలో సర్పంచ్ మల్లగారి విమల, కార్యదర్శి అరుణ్ కుమార్ను అభినందిస్తూ ప్రశంసాపత్రం అందజేశారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. టీబీ నిర్మూలనలో బాచేపల్లి PHCకి 3వ స్థానం దక్కింది.
News March 25, 2026
లాస్ట్ మినిట్ డుమ్మాతో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది: గంగూలీ

టీమ్ ఇండియా కంటే IPL టీమ్ను నిర్మించడమే కష్టమని గంగూలీ అన్నారు. ‘భారత జట్టుకైతే బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ IPLలో ప్లేయర్స్ 10 టీమ్స్కు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇలాంటి టైమ్లో క్వాలిటీ ప్లేయర్స్ లాస్ట్ మినిట్లో రాకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది’ అని గంగూలీ అన్నారు. మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా ఈ కామెంట్స్ చేశారు.
News March 25, 2026
మార్చి 25: చరిత్రలో ఈరోజు

1655: శని గ్రహ అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు.
1914: ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జననం (ఫొటోలో)
1931: స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు గణేశ్ శంకర్ విద్యార్థి మరణం.
1933: భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ జననం.
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం.


