News January 27, 2025
శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News March 13, 2026
TU: 16 నుంచి ఎం.ఈడీ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎం.ఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
News March 13, 2026
NTR: హైకోర్టు లాయర్పై దాడి కేసులో కీలక మలుపు

విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాదిపై 2023లో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News March 13, 2026
వారసత్వ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు!

AP: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై గ్రామాల్లోని ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు.


