News January 27, 2025

31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

image

ఈనెల 31న TTD పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు X వేదికగా తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.

Similar News

News September 18, 2025

కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

image

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

నిర్మల్: ‘ఈనెల 20న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం’

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 20వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను పాఠశాలలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా వారందరికీ ఆహ్వానం అందించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా సమావేశం నిర్వహించాలన్నారు.

News September 18, 2025

అనకాపల్లి జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాను డ్రగ్స్, క్రైమ్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్న అంశాలను వివరించారు. హాట్ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఆకతాయిల బెడద లేకుండా చూడాలన్నారు. జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.