News January 27, 2025
కామారెడ్డి: జిజిహెచ్ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లోని పలు ఉద్యోగులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది ఆదివారం ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పలు విభాగాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 2, 2025
విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
News November 2, 2025
WNP: భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి(D) పెబ్బేరులో జరిగింది. ‘మహేందర్, సువర్ణ చెలిమిళ్లలో నివాసముంటున్నారు. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని సువర్ణను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. శుక్రవారం కూడా అతడు భార్యతో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురైన సువర్ణ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది’ అని పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్తో పోలిస్తే 8.77శాతం వృద్ధి


