News March 18, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి: PM మోదీ

image

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయని PM మోదీ అన్నారు. ‘BRS ప్రజలను దోచుకుంది. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది. ఆ పార్టీ చేసిన అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను కాంగ్రెస్ ATMగా మార్చుకుంది. రాష్ట్ర ప్రజల డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం’ అని పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

ఘోరం.. నెయ్యి పోసి, సిలిండర్ పేల్చి చంపేసింది

image

ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సహజీవనం చేస్తున్న రామ్‌కేశ్(32) తన ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని అమృత(21) బ్రేకప్ చెప్పింది. ఈనెల 6న Ex బాయ్‌ఫ్రెండ్‌ సుమిత్‌తో కలిసి రామ్‌కేశ్ గొంతు కోసి చంపింది. బాడీపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి సిలిండర్‌‌ను పేల్చింది. ఫోరెన్సిక్ చదువు, క్రైమ్ సిరీస్‌ల తెలివితో అమృత మేనేజ్ చేసినా CCఫుటేజీ, ఫోన్ లొకేషన్‌తో దొరికిపోయింది.

News October 27, 2025

ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

image

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.

News October 27, 2025

రెండో దశ SIR ఇలా..

image

* రెండో దశ <<18119730>>SIRలో<<>> భాగంగా 12 రాష్ట్రాలు, UTల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేయనున్నారు.
*5.33 లక్షల BLOలు, 7 లక్షల BLAలు పాల్గొంటారు. వీరికి ట్రైనింగ్ వెంటనే మొదలవుతుంది.
*నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ఎన్యుమరేషన్ జరుగుతుంది. BLOలు ప్రతి ఇంటిని 3సార్లు విజిట్ చేస్తారు.
*డిసెంబర్ 8న డ్రాఫ్ట్ జాబితాలు ప్రచురిస్తారు. 2026 జనవరి 8 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురిస్తారు.