News January 27, 2025
UAE లేదా బంగ్లాతో భారత్ వామప్ మ్యాచ్?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమ్ ఇండియా ఓ వామప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లేదా యూఏఈలో ఏదో ఒకదానితో ఈ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది. మార్చి 9న మెగా ఈవెంట్ ఫైనల్ జరగనుంది.
Similar News
News November 1, 2025
మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <
News November 1, 2025
అదునులో పొదలో చల్లినా పండుతుంది

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.
News November 1, 2025
2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.


