News January 27, 2025
నంద్యాల నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. సోమవారం పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపిక పోటీలు ఉన్నందున సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అర్జీదారులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని సూచించారు.
Similar News
News December 28, 2025
నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.
News December 28, 2025
రాజంపేట: ‘ప్రభుత్వం.. అన్నమయ్య ఆగ్రహానికి గురికాక తప్పదు’

అన్నమయ్య పేరుతో ఉన్న జిల్లాను తొలగిస్తే.. శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమయ్య ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని రాజంపేట వాసులు శాపనార్థాలు పెడుతున్నారు. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా చేయాలని ప్రతిపాదన రావడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది. రాయచోటి ప్రాంతీయులు బంద్కు పిలుపునివ్వగా ఆదివారం రాజంపేటలోని పాత బస్టాండ్ కూడలిలో ఆందోళనకు జేఏసీ సిద్ధమైంది.
News December 28, 2025
బాపట్ల జిల్లా పోలీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

బాపట్ల జిల్లా ఆవిర్భావం తర్వాత 2022 డిసెంబర్ 28న తొలిసారిగా అప్పటి SP వకుల్ జిందాల్ వార్షిక నేర నివేదికను ప్రజలముందు ఉంచారు. జిల్లా ఏర్పడి 9 నెలలే అయినప్పటికీ, ప్రధానంగా నేరస్థులకు శిక్షలు వేయించే ‘కన్విక్షన్స్’ విషయంలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఆ ఏడాది ఏకంగా 1,341 కేసుల్లో నేరస్థులకు శిక్షలు ఖరారయ్యాయని, కొత్త జిల్లాలో శాంతిభద్రతల అమలుకు నిదర్శనమన్నారు.


