News March 18, 2024

టీడీపీకి బిగ్ షాక్?

image

AP: విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని TDP అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారట. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. అటు బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 7, 2025

10న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

News July 7, 2025

రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహించండి: CM రేవంత్

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG CM రేవంత్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా, జాతీయ, అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రైల్వే టికెట్లలో రాయితీని పునరుద్ధరించాలని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.