News March 18, 2024
బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710745111103-normal-WIFI.webp)
BJPకి అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని PM మోదీ అన్నారు. ‘రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చాం. పంట ధరను క్వింటాల్కు ₹6వేల నుంచి ₹30వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేము ₹6,400కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రగతిపై దృష్టి సారిస్తాం’ అని తెలిపారు.
Similar News
News July 3, 2024
విద్యార్థులకు గుడ్న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718229788795-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
News July 3, 2024
ఫొటో తీసి రూ.20వేలు గెలిచే ఛాన్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719964837320-normal-WIFI.webp)
AUG19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం(న్యూస్ క్లిప్) విభాగాల్లో ఫొటోలు తీయాలి. మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, తర్వాత ఐదుగురికి ప్రోత్సాహకంగా రూ.5వేలు ఇస్తుంది. ఫొటోలను adphoto.ts@gmail.coకి పంపాలి. మరిన్ని వివరాలకు 9949351523కి ఫోన్ చేయవచ్చు.
News July 3, 2024
రాహుల్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719920660062-normal-WIFI.webp)
అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చి లోక్సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరాను. హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సీనియర్ నేతలున్నా అరాచక, అబద్ధాల మార్గంలో వెళ్లాలనుకోవడం ఆందోళనకరమన్నారు.