News January 27, 2025
HYD: నేడు హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి

HYD బుద్ధభవన్లో గల హైడ్రా కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలు తదితర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కాగా.. ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News September 19, 2025
భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే కొణాతాల

పరిశ్రమల కోసం భూములిచ్చి సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ కోరారు. 2వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 25 వేల ఎకరాలను రూ.2వేలకు ఇచ్చిన వారికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. అచ్యుతాపురం, నక్కపల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. భూ నిర్వాసితులకు ప్రత్యేక శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గానూ పనిచేశారు.
News September 19, 2025
HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.