News January 27, 2025

జన్నారం: పడగ విప్పిన పాములా బండరాయి

image

జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్‌లో ఉన్న అడవిలో ఓ రాయి పడగ విప్పిన పాములా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైసమ్మ కుంట నుంచి గనిశెట్టి కుంటకు వెళ్లే మార్గంలో అడవి మధ్యలో పడగ విప్పిన పాము మాదిరిగా రాయి దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది బండ రాయిగా కనిపిస్తుందని ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. అయితే అటవీ నిబంధనలు ఉండటంతో దాని సందర్శనకు అనుమతి లేదన్నారు.

Similar News

News March 12, 2025

కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 12, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.

News March 12, 2025

NLG: GGHలో భద్రత డొల్ల!…

image

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

error: Content is protected !!