News January 27, 2025

మేడ్చల్: టెన్త్ పరీక్షల కోసం 40 రోజుల PLAN

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ 40 రోజుల ప్రత్యేక ప్రణాళికను అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక టెస్టులు  నిర్వహించనున్నట్లు DEO విజయ కుమారి తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, ప్రీ ఫైనల్, వార్షిక పరీక్షల కోసం కసరత్తు జరగనుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News October 27, 2025

KMR: ‘లిక్కర్ లక్కు’ ఎవరిని వరించనుంది..?

image

కామారెడ్డి జిల్లాలోని 49 వైన్స్ షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 49 వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 45.06 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం వరిస్తుందో, మద్యం షాపులు ఎవరికి దక్కుతాయోనని జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

News October 27, 2025

GNT: 39 ఏళ్ల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు.!

image

ప్రముఖ పండితులు, కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. 27-10-1914 నాడు ఆయన మరణించారు.

News October 27, 2025

పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.