News March 18, 2024
సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.
Similar News
News March 11, 2026
HYDలో డైనోసార్ ఆనవాళ్లు.. చూద్దాం రండి!

HYDలోని డాక్టర్ విలియం కింగ్ జియోలాజికల్ మ్యూజియం భూగర్భ అద్భుతాల ప్రదర్శనశాలగా నిలుస్తోంది. GSI ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో డైనోసార్ శిలాజాలు, అరుదైన ఖనిజాలు భౌగోళిక చరిత్రను చూపిస్తున్నాయి. భూమి పుట్టుక, ఖండాల ఏర్పాటుపై మ్యూజియంలో వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి పెంచేలా సమాచారం, నమూనాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనానికి కేంద్రంగా నిలుస్తోంది.
News March 11, 2026
HYDలో డైనోసార్ ఆనవాళ్లు.. చూద్దాం రండి!

HYDలోని డాక్టర్ విలియం కింగ్ జియోలాజికల్ మ్యూజియం భూగర్భ అద్భుతాల ప్రదర్శనశాలగా నిలుస్తోంది. GSI ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో డైనోసార్ శిలాజాలు, అరుదైన ఖనిజాలు భౌగోళిక చరిత్రను చూపిస్తున్నాయి. భూమి పుట్టుక, ఖండాల ఏర్పాటుపై మ్యూజియంలో వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి పెంచేలా సమాచారం, నమూనాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనానికి కేంద్రంగా నిలుస్తోంది.
News March 10, 2026
HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.


