News January 27, 2025

దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

image

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్‌కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 17, 2025

అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

image

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.

News September 17, 2025

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా ప‌నితీరు ఉండాలి: లక్ష్మీశా

image

ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా అధికారులు తమ ప‌నితీరును మెరుగుప‌రుచుకోవాలని క‌లెక్ట‌ర్ లక్ష్మీశా అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వీడియో కాన్ఫ‌రెన్స్ హాల్ నుంచి ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల ఆదాయాలను పెంచడానికి దోహదపడే ఉద్యానవన, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News September 17, 2025

సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సమీక్ష

image

వరంగల్‌లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రంగలీల మైదానంలో జరుగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మేయర్, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్‌తో ఆమె చర్చించారు. వేడుకలను ఘనంగా, సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.