News January 27, 2025
ఖమ్మం: తెలంగాణ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వైష్ణవి రత్న

పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైష్ణవి రత్న జాతీయస్థాయి అండర్ 17 క్రికెట్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్లోని ఓ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కెప్టెన్గా ఉన్న వైష్ణవి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానం పొందింది. తెలంగాణ జట్టుకు కెప్టెన్గా ఎంపికైనట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ నరసింహమూర్తి ప్రకటించారు.
Similar News
News January 8, 2026
విశాఖ: భవనం పైనుంచి పడి బాలిక మృతి

మల్కాపురం పీఎస్ పరిధిలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి బాలిక మృతి చెందింది. జనతా కాలనీలో నివసిస్తున్న కనకరాజు కుమార్తె అమృత ఈ నెల 4న రెండో రెండో అంతస్తులో నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతుండగా కింద నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి ఆమె భవనం పైనుంచి తొంగి చూసింది. ఈ క్రమంలో పట్టు తప్పి బాలిక భవనంపై నుంచి కిందకు తూగి పడిపోయింది. తలకు గాయం అవడంతో కేజీహెచ్కు తరలించగా బుధవారం బాలిక మృతి చెందింది.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.
News January 8, 2026
VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సుందరపేట సీహెచ్సీకి, డ్రైవర్ను కేంద్రాసుపత్రికి తరలించారు.


