News January 27, 2025

మేడ్చల్‌లో బోధన్‌కు చెందిన మహిళ హత్య

image

మేడ్చల్‌ మండలంలో ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ నెల 24న జరిగిన <<15246720>>మహిళ <<>> హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ బోధన్‌కు చెందిన వివాహితగా గుర్తించారు. భర్తకు దూరంగా కొంపల్లిలో మరో వ్యక్తితో ఆమె ఉంటున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే ఈ కేసులో ఆ వ్యక్తి కీలకంగా మారనున్నాడు. కాగా.. వివాహిత కుటుంబంతో పాటు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరిస్తున్నారు.

Similar News

News March 14, 2025

మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

image

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్‌గడిమలక్‌పేట, మజీద్‌పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.

News March 14, 2025

HYD: 5K రన్‌కు హాజరు కావాలని వినతి

image

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్‌కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్‌ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.

News March 14, 2025

జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

image

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.

error: Content is protected !!