News January 27, 2025
20 రోజుల్లో 12 ఘటనలు.. మహిళలకు రక్షణేది?: YCP

AP: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని YCP ఆరోపించింది. ‘రాష్ట్రంలో నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇదే విషయమై Dy.CM పవన్ హోంమంత్రిపై వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. అయినా అత్యాచారాలు, హత్యలు తగ్గడం లేదు. వీటివెనక కొంతమంది TDPనేతలు, వారి కుమారులున్నారు’ అని ట్వీట్ చేసింది. 20రోజుల్లో 12ఘటనలు జరిగాయని పేర్కొంది.
Similar News
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<
News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?