News January 27, 2025

పదోన్నతి అర్హత పరీక్షకు పరిశీలించిన వరంగల్ సీపీ

image

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతికై మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వరం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనల్లో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ఏఎస్ఐ పదోన్నతికై సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది.

Similar News

News November 3, 2025

SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

image

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.

News November 3, 2025

ములుగు: నెదర్లాండ్స్ పర్యటనకు మంత్రి సీతక్క..!

image

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించే నిమిత్తం ఆమె నెదర్లాండ్స్‌కు వెళ్లారు. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో, పార్టీ వర్గాలు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపి, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

News November 3, 2025

ఆసిఫాబాద్: 7 మద్యం షాపులకు.. రేపే లక్కీ డ్రా

image

ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు అక్టోబర్ 27న 25 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు రేపు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.