News January 27, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళ ఆత్మహత్య

image

వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆలంపల్లికి చెందిన పావని(27), నిజాంపూర్ వాసి సాయికిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త సాయి కిరణ్, అత్త, మరిది వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చనిపోయింది. సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

image

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్‌ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.

News September 16, 2025

KNR: SEPT 17న జాతీయ పతాకం ఆవిష్కరించేది వీరే..!

image

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, ఛైర్మన్లను నియమించింది. JGTLలో BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్, PDPLలో మైనారిటీస్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, KNRలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, SRCLలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 16, 2025

KNR: GST ఎఫెక్ట్.. వెలవెలబోతున్న షోరూమ్స్..!

image

కొత్త GST విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. కొత్త GST స్లాబులు వచ్చేవరకు కస్టమర్లు వెయిట్ చేస్తుండడంతో ఎలక్ట్రానిక్స్, కార్లు, బైకులు, త్రిచక్రవాహనాల షోరూంలు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా కార్స్ 9%, బైక్స్ 7%, ఎలక్ట్రానిక్స్ ధరలు 5% తగ్గనున్నాయి. కొత్త GSTతో పాటు దసరా, దీపావళి ఆఫర్లతో ఒక్కసారిగా కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.