News January 27, 2025
సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లకు ₹25 కోట్లు

12 ఏళ్లకోసారి జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ₹25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15-26 వరకు జరగనున్న పుష్కరాల్లో మౌలిక వసతులు, స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణ సహా తదితర పనులను చేపట్టనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
Similar News
News September 17, 2025
నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.
News September 17, 2025
టీనేజర్ల కోసం ChatGPTలో సెక్యూరిటీ ఫీచర్లు!

టీనేజర్ల భద్రత, ప్రైవసీ కోసం ChatGPTలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తున్నట్లు OpenAI ప్రకటించింది. యూజర్లను వయసు ఆధారంగా 2 కేటగిరీలుగా (13-17, 18+) గుర్తించేందుకు age ప్రిడిక్షన్ సిస్టమ్ను తీసుకురానుంది. యూజర్ ఇంటరాక్షన్ను బట్టి వయసును అంచనా వేయనుంది. కొన్నిసార్లు ఏజ్ వెరిఫై కోసం ID కూడా అడుగుతుందని సంస్థ తెలిపింది. సూసైడ్ వంటి సెన్సిటివ్ అంశాలపై AI స్పందించదని వివరించింది.
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్ను ICC తిరస్కరించింది.