News March 18, 2024

BREAKING: ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.

Similar News

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.

News August 27, 2025

అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

image

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News August 27, 2025

వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్

image

TG: HYD నగరానికి వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని అధికారులకు CM రేవంత్ చెప్పారు. గేట్ వే ఆఫ్ HYD, గాంధీ సరోవర్, జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని, పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టుల DPR సిద్ధం చేసి పనులు మొదలెట్టాలని ఆదేశించారు.