News January 28, 2025

కర్ణాటక మంత్రులను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే

image

యాద్గిర్‌లో కర్ణాటక హోమ్ మినిస్టర్ డా. జి. పరమేశ్వర, పరిశ్రమల మంత్రి శరణబసప్పను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాల పై చర్చించారు. అనంతరం భోజనం చేశారు. యాద్గిర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్ తున్నూర్, షోరాపూర్ ఎమ్మెల్యే రాజా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 14, 2025

MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

News March 14, 2025

MBNR: ఘనంగా కామ దహన వేడుకలు (PHOTO)

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామ దహనం తర్వాతి రోజు ప్రజలు హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకోనున్నారు.>>HAPPY HOLI

News March 14, 2025

MBNR : నవవధువు సూసైడ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసులు వివరాలు.. కొందుర్గు మం. ఎన్కెపల్లికి చెందిన సుజాత(21)కు నవాబ్‌పేట మం. లింగంపల్లికి చెందిన రాములుతో గత నెల 7న పెళ్లైంది. కాగా పెళ్లికి రూ.6 లక్షలు అయ్యాయని అవి తీసుకురావాలని భర్త ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో వెంకిర్యాలలో టీస్టాల్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకొచ్చిన సుజాత బాత్‌రూమ్‌లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI బాలస్వామి తెలిపారు.

error: Content is protected !!