News January 28, 2025

బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు వాసికి గోల్డ్ మెడల్

image

బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు పూజారి కుమారుడు సత్తా చాటాడు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు కోటేశ్వర స్వామి దేవాలయం పూజారి చంద్రశేఖర్ స్వామి కుమారుడు అభిషేక్ స్వామి ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 55 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, మ్యాన్ ఫిజిక్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు డాక్టర్ సమత్ కుమార్ అభినందించారు.

Similar News

News November 13, 2025

పల్నాటి కోడి పందెం.. యుద్ధానికి దారి తీసింది!

image

పల్నాటి యుద్ధానికి దారి తీసిన కీలక ఘటన కోడి పందెంలో చోటు చేసుకుంది. బ్రహ్మనాయుడి కోడిపుంజు చిట్టిమల్లు, నాగమ్మ కోడిపుంజు నల్లమల్లుతో పోటీపడింది. మొదటి పందెం నల్లమల్లు గెలవగా, రెండో పందెంలో నాగమ్మ శివంగి డేగను దింపింది. ఈ పందెంలో చిట్టిమల్లు మృతి చెందడంతో, మాచర్ల రాజులు దీనిని అవమానంగా భావించారు. ఈ ఘటనే క్రమంగా ఉద్ధృతమై చివరకు పల్నాటి యుద్ధానికి నాంది పలికింది.

News November 13, 2025

ప్రభుత్వ షట్‌డౌన్ బిల్లుకు US కాంగ్రెస్ ఆమోదం

image

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. దీన్ని ముగించే బిల్లుకు US కాంగ్రెస్‌లో ఆమోదం లభించింది. ఓటింగ్‌లో అనుకూలంగా 222 ఓట్లు రాగా వ్యతిరేకంగా 209 వచ్చాయి. ఈ బిల్లును సభ అధ్యక్షుడు ట్రంప్‌నకు పంపింది. ఆయన ఆమోదం అనంతరం 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ ముగియనుంది.

News November 13, 2025

మహిళల్లో మైగ్రేన్‌కి ఎన్నో కారణాలు

image

మైగ్రేన్‌ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రేన్‌​ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.