News January 28, 2025
జాతీయస్థాయి పోటీలకు జైపూర్ విద్యార్థిని

జైపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సంజన జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల HM శ్యాంసుందర్, PDగోపాల్ మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో సంజన అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. జాతీయస్థాయి పోటీలు ఫిబ్రవరి 3నుంచి 9వరకు హరియాణాలో జరుగుతాయన్నారు.
Similar News
News November 6, 2025
కార్తీక మాసం.. అయినా చికెన్ ధరలు తగ్గలే..!

నల్గొండలో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ.200కు పైగానే అమ్ముతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ ధరలు యథావిధిగా ఉన్నాయని చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్కిన్లెస్ రూ.220 నుంచి రూ.245 వరకు విక్రయించారు. విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.215 మధ్య అమ్మకాలు జరిపారు. మరి కొన్ని రోజులు ఇదే విధంగా ధరలు ఉండనున్నాయి. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
News November 6, 2025
225 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TGలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 18- 30ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. HYD, కరీంనగర్, ఖమ్మం, MBNR, మెదక్, WGL జిల్లాల్లో ఖాళీలున్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి
News November 6, 2025
యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.


