News January 28, 2025
NRPT: లిఫ్టులో ఇరుక్కున్న ఇద్దరు.. సురక్షితంగా బయటికి

కోర్టులో తమ న్యాయవాదిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు లిఫ్టులో ఇరుక్కున్న ఘటన సోమవారం NRPT కోర్టు భవన సముదాయంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం దుప్పట్ ఘాట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్,అంజయ్య ఓ పని నిమిత్తం కోర్టుకు వచ్చి లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కరెంటు పోయి సుమారు 45 ని,పాటు మధ్యలో ఆగిపోయింది. అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వారు ఇరుక్కున్న వారిని బయటకి తీశారు.
Similar News
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.
News November 17, 2025
నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.


