News March 18, 2024

ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదం.. ఈసీకి ఫిర్యాదు

image

నిన్న ప్రధాని మోదీ ఏపీ పర్యటన వివాదాస్పదంగా మారింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ TMC ఎంపీ సాకేత్ గోఖలే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే 1975లో ఇందిరాగాంధీపై అనర్హత వేటు పడిందని చెప్పారు. ఒక వేళ బీజేపీ IAF చాపర్‌కు రెంట్ చెల్లించి ఉంటే.. దానికి గల కారణాలను కూడా ఈసీ వెల్లడించాలని కోరారు.

Similar News

News March 7, 2026

MEC తర్వాత ఏయే కోర్సులు చేయొచ్చంటే?

image

<<19311173>>ఇంటర్‌లో<<>> MEC పూర్తి చేసిన విద్యార్థులకు ఒకప్పుడు ప్రధాన లక్ష్యం ‘CA’ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మ్యాథ్స్‌పై పట్టు ఉండి సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లాలనుకున్నవారు BCA లేదా Data Analytics కోర్సులను ఎంచుకోవచ్చు. మేనేజ్‌మెంట్ రంగంపై ఆసక్తి ఉన్నవారు BBA ద్వారా కార్పొరేట్ కంపెనీల్లో స్థిరపడవచ్చు. డిగ్రీలో BA, B.Com, BScలో చేరవచ్చు. LAW, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. రేపు CEC గురించి..

News March 7, 2026

మీ మద్య నిషేధం హామీ వెనుక అసలు కథ ఇదేనా: లోకేశ్

image

AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం రాష్ట్రంలో వేల కుటుంబాలను నాశనం చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘ప్రతి నెలా ₹100 కోట్ల కిక్‌బ్యాక్‌లు, ₹3,500 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని ED బయటపెట్టింది. మద్య నిషేధం అమలు చేస్తామన్న హామీ వెనుక అసలు కథ ఇదేనా జగన్? మీ అనుచరుల జేబుల్లో వేల కోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పగలరా? నిశ్శబ్దమే మీ సమాధానమా?’ అని ట్వీట్ చేశారు.

News March 7, 2026

హెయిర్ కట్ సరిగా చేయలేదని ₹25లక్షల ఫైన్

image

హెయిర్ కట్‌లో పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 2018లో ఓ మోడల్ హెయిర్ కట్ కోసం ముంబై ITC హోటల్ సెలూన్‌కు వెళ్లింది. స్టైలిస్ట్ చేసిన వర్క్ ఆమెకు నచ్చలేదు. దీంతో తాను మానసికంగా కుంగి మోడలింగ్, ఇంటర్వ్యూ అవకాశాలు కోల్పోయానని కన్జూమర్ ఫోరంలో కంప్లయింట్ చేసింది. కమిషన్ 2021లో ₹2కోట్ల పరిహారం ప్రకటించగా, ITC సుప్రీంకు వెళ్లింది. దీంతో తీర్పు రివైజ్ చేస్తూ ₹25 లక్షలు ఇవ్వాలని SC ఆదేశించింది.