News January 28, 2025

HYD: శంకర్‌పల్లికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి

image

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి రానున్నారు. ఇక్కడ 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్కును మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ప్రారంభించనున్నారు. ఉ.11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్క్ అధినేత రాందేవ్‌రావు తెలిపారు. తమ పార్క్‌లో అరుదైన జాతులకు సంబంధించి 25 వేల రకాల మొక్కలను పెంచామన్నారు.

Similar News

News July 7, 2025

శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తవేతకు రంగం సిద్ధం!

image

ఈ నెల 10వ తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 7, 2025

సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై దాడులు

image

సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో ఆదివారం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ దాడుల్లో ఓ నిర్వాహకురాలితోపాటు, ఇద్దరు మహిళలు, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News July 7, 2025

వరంగల్: కోరికలు తీరాలని తాళం వేస్తారు!

image

ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. అలాగే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా దర్శనానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలని దర్గాలోని గ్రిల్స్‌కు తాళం వేస్తారు. కోరికలు నెరవేరిన అనంతరం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకతీతంగా వచ్చే భక్తులు ఈ ఆనవాయితీని పాటిస్తుండటం విశేషం. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు కిక్కిరుస్తారు.