News March 18, 2024
BREAKING: ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు

లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్తో పాటు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 27, 2025
గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.
News August 27, 2025
అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
News August 27, 2025
వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్మెంట్: CM రేవంత్

TG: HYD నగరానికి వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని అధికారులకు CM రేవంత్ చెప్పారు. గేట్ వే ఆఫ్ HYD, గాంధీ సరోవర్, జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని, పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టుల DPR సిద్ధం చేసి పనులు మొదలెట్టాలని ఆదేశించారు.