News March 18, 2024
BREAKING: ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు
లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్తో పాటు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 30, 2024
VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్
ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్ డిన్నర్కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
News September 30, 2024
‘ఎమర్జెన్సీ’ సెన్సార్ కట్కు అంగీకరించిన కంగన
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగనున్నాయి. ఈ చిత్రం విడుదలకు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయడానికి కంగన అంగీకరించినట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పులను చిత్రంలో సర్దుబాటు చేసే విషయమై చిత్రం కో-ప్రొడ్యూసర్ జీ స్టూడియోస్ కొంత సమయం కోరడంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.
News September 30, 2024
సీఎం, TTD ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలి: సుప్రీం
AP: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? SEP 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు. ఆ నెయ్యి వాడలేదని TTD చెబుతోంది’ అని సుప్రీం తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని GOVT తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు.