News January 28, 2025

కామారెడ్డి: భర్తను హత్య చేయించిన భార్య..!

image

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు శివారులో లభ్యమైన <<15278298>>నారాయణ<<>> మృతదేహం మిస్టరీ వీడింది. హత్నూర పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణ భార్య లక్ష్మి నర్సవ్వ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 9, 2025

వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

image

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.

News November 9, 2025

ఇతిహాసాలు – 61 సమాధానం

image

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 9, 2025

వారంలో టెట్ నోటిఫికేషన్?

image

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్​ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్​ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్​ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్​ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.