News January 28, 2025
HYD: సమస్య పరిష్కారం కాకుంటే రంగంలోకి దిగుతా: రంగనాథ్

నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసేందుకు ప్రజలు హాజరయ్యారని, ఆయా ఫిర్యాదులకు సంబంధించిన రెండు వారాల్లో అధికారులు ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి విచారణ చేపడతారన్నారు. 78 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయని తెలిపారు.
Similar News
News November 5, 2025
జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్పై ఆరోపణలు

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.


