News January 28, 2025
ELR: పోలీసులమంటూ రూ.20 లక్షలు కొట్టేశారు..!

ఓ రిటైర్డ్ ఉద్యోగినే మోసం చేసిన వైనం ఇది. వట్లూరుకు చెందిన మైన్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ డీడీ రంగారావు(67)కు ఈనెల 21న బెంగళూరు వ్యక్తి ఫోన్ చేశాడు. ‘ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. అతని వెనుక మీరున్నట్లు తేలింది. ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.20లక్షలు ఇవ్వండి’ అని చెప్పడంతో రంగారావు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో బాధితుడు ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News November 13, 2025
HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.
News November 13, 2025
HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.
News November 13, 2025
HNK: రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థలో రేపటి నుంచి ఈనెల 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహించి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ముగింపు రోజు బహుమతులను అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో వారోత్సవాలకు హాజరుకావాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.


